
ఆసిఫాబాద్, వెలుగు: బాబాపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు హిమబిందు(పదోతరగతి), బిక్కుబాయి(తొమ్మిదో తరగతి) ఎవరెస్ట్శిఖరాన్ని అధిరోహించారు. గత నెల 25న నేపాల్ వెళ్లిన విద్యార్థినులు ఈ నెల 5న ఎవరెస్ట్ఎక్కారు. బీసీ గురుకులాల సొసైటీ రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 20 మంది విద్యార్థులు ఈ ట్రిప్లో ఉన్నారు. ఎవరెస్ట్శిఖరం ఎక్కిన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాబాయి శుక్రవారం అభినందించారు.